నిజామాబాద్ : రెండు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గోదావరి ముఖద్వారమైన నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద వరద ఉగ్రరూపంలో ప్రవహిస్తున్నది. ఎగువ మహారాష్ట్ర నుంచి 3 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుండడంతో పాటు నిజాంసాగర్ గేట్లు ఎత్తడంతో మంజీరా నది ద్వారా వరద భారీగా త్రివేణి సంగమం వద్ద పోటెత్తుతున్నది. తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులోని గోదావరి నది పై నిర్మించిన హై లెవల్ వంతెనకు తాకుతూ గోదారమ్మ ప్రవహిస్తున్నది.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అవసరమైతే తప్పా బయటకు రావొద్దన్నారు. వర్షాలు కురుస్తున్నప్పుడు చెట్ల కింద ఉండొద్దని, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని అత్యవసర సమయాల్లో టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి సహాయం పొంందవచ్చన్నారు.