హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): ప్రజల్లో ఎలక్ట్రిక్ వాహనాలపై మరింత అవగాహన కల్పించటం, చైతన్యం తేవటానికి ఆదివారం ఉదయం 10 గంటలకు పీవీ నరసింహారావుమార్గ్ (నెక్లెస్ రోడ్డు)లోని పీపుల్స్ప్లాజాలో ‘గో ఎలక్ట్రిక్’ ప్రచారాన్ని విద్యుత్తుశాఖమంత్రి జగదీశ్రెడ్డి ప్రారంభించనున్నారు. కేంద్రప్రభుత్వం ఫిబ్రవరిలో ప్రారంభించిన ఈ ప్రచారాన్ని రాష్ర్టాల వారీగా చేపడుతున్నారు. దీనిలో భాగంగా రోడ్షో, ప్రదర్శన ఉంటుంది. ఇందులో టీఎస్రెడ్కో చైర్మన్ సయ్యద్ అబ్దుల్ అలీమ్, రవాణాశాఖ స్పెషల్ సీఎస్ సునీల్శర్మ, మున్సిపల్శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్కుమార్, ఐటీ, పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్రంజన్, విద్యుత్తుశాఖ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా, రెడ్కో వీసీఎండీ జానయ్య తదితరులు పాల్గొంటారు. తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలు, మౌలికవసతుల కల్పన, అమలుకు టీఎస్రెడ్కో నోడల్ ఏజెన్సీగా ఉంది. సుమారు 40 కంపెనీలు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి. ఇందులో ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల ఎలక్ట్రికల్ వాహనాలు, సర్వీసు ప్రొవైడర్లకు సంబంధించిన ప్రదర్శన, సమాచారం లభిస్తుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది.