హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. రాష్ట్రంలో సుమారు 40 వేల మంది గ్రామ పంచాయతీ కార్మికులు పారిశుద్ధ్యం, వీధిదీపాల నిర్వహణ, వాటర్సపె్లై, కారోబార్, బిల్ కలెక్టర్లు, ఆఫీస్ నిర్వహణ తదితర పనులు నిర్వహిస్తున్నారని తెలిపారు. వీరిలో అత్యధికులు దళితులు, గిరిజనులు, బలహీనవర్గాలకు చెందిన పేదలేనని గుర్తుచేశారు.
జీవో 60ని వర్తింపజేస్తూ పారిశుద్ధ్య కార్మికులకు రూ.15,600, కారోబార్ , బిల్ కలెక్టర్లు, ట్రాక్టర్ డ్రైవర్లు, వీధి దీపాల నిర్వహణ, వాటర్ సపె్లై కార్మికులకు రూ.19,500, కంప్యూటర్ ఆపరేటర్లు, టెక్నికల్ విభాగంలో పనిచేసే సిబ్బందికి రూ.22,750 వేతనం చెల్లించాలని కోరారు. యాక్ట్ 2/94ను రద్దుచేసి పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.