హైదరాబాద్: వివిధ రంగాల్లో కృత్రిమ మేధ (ఏఐ) చేస్తున్న అద్భుతాలు.. అన్నీ ఇన్నీ కావు. అంధులు, దృష్టి లోపం ఉన్నవారి కోసం తయారు చేసిన ఏఐ ఆధారిత పరికరాలు వైద్యరంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతున్నాయి. ఏఐ సాంకేతికతతో పనిచేసే ‘స్మార్ట్ విజన్’ అనే పరికరాన్ని అమర్చిన కంటి అద్దాల్ని ఇటీవల హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానలో 50 మందికి పంపిణీ చేశారు. వీటి సాయంతో అంధులు ఏ వస్తువునైనా చూడొచ్చు. సందేశాల్ని చదవొచ్చు. నడుస్తుండగా అడ్డొచ్చేవాటిని, ఎదుటి వ్యక్తుల్ని గుర్తించవచ్చు. మల్టీ టాస్కింగ్ను ఏకకాలంలో చేపట్టేందుకు ‘స్మార్ట్ విజన్’లో పలు సెన్సార్లను అమర్చారు. రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీతో ఇది త్రీడీ ఇమేజ్లను సృష్టిస్తుంది.
‘స్మార్ట్ విజన్’లో బ్లూటూత్, మైక్రోఫోన్, స్పీకర్ను ఏర్పాటుచేశారు. దీన్ని ఏఐ అప్లికేషన్కు అనుసంధానం చేస్తారు. దాంతో కృత్రిమ మేధ సేవలు అంధులకు అందుబాటులోకి వస్తాయి. బ్రెయిలీ లిపిలో ఉన్న బటన్స్ను నొక్కటం ద్వారా లేదా వాయిస్ కమాండ్స్ ఇవ్వటం ద్వారా స్మార్ట్ విజన్ సేవల్ని పొందుతారు. బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ‘విజన్ ఏయిడ్’ వంటి స్వచ్ఛంద సంస్థల సహకారంతో 2021లో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టారు. ఫేస్ రికగ్నేషన్, మనుషుల భావాలు, చుట్టుపక్కల ఉండే వాహనాలు, వస్తువులు, ట్రాఫిక్ సిగ్నల్స్, జీబ్రా క్రాసింగ్ లైన్స్..మొదలైనవి పసిగట్టే మెషిన్ లెర్నింగ్తో ఏఐని రూపొందించారు. ఈ పరికరం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అంధులతో మాట్లాడుతుంది.
ఫీచర్లు..