హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, వికలాంగులు, మైనార్టీ విద్యార్థులకు సంబంధించి ఉపకార వేతనాల విడుదలపై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్లోని అరణ్య భవన్లో సమీక్ష నిర్వహించారు. ఆరు శాఖలకు సంబంధించి ఈ నెల 31వ తేదీ వరకు ఇవ్వాల్సిన రూ. 362.88 కోట్ల ఉపకార వేతనాలు వెంటనే విడుదల చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
దీంతో పాటు మార్చి 31 వ తేదీలోగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, విగలాంగులు, ఈబీసీ, మైనార్టీ శాఖల నుంచి బిల్లులు అందలేదన్న కారణంతో.. ట్రెజరీ అధికారులు తిప్పి పంపారని మంత్రి హరీశ్ రావు దృష్టికి రావడంతో దీనిపైన సమీక్షించారు.
ఇందుకు సంబంధించిన బిల్లులను సంబంధింత శాఖలు తిరిగి ట్రెజరీకి సమర్పించాలన్నారు. ఆ బిల్లులను వెంటనే ట్రెజరీ అధికారులు క్లియర్ చేయాలని మంత్రి ఆదేశించారు.
దీంతో పాటు 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపకారవేతనాల బీఆర్వోలను వి డుదల చేయాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, ఎస్సీ డెవలప్మెంట్ కమిషనర్ యోగితా రాణా, ఆర్థిక శాఖ అధికారులు పాల్గొన్నారు.