హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లకు పదోన్నతులు కల్పించాలని గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ (జీటీఏ) కోరింది. ఈ మేరకు సోమవారం విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించింది. ఎంఈవో సహా ఇతర పోస్టులకు అర్హతల ప్రకారం పదోన్నతులు కల్పించాలని జీటీఏ నాయకులు కోరారు. మంత్రిని కలిసినవారిలో జీటీఏ అధ్యక్షుడు కాసం ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి మేరోజు బ్రహ్మచారి, అసోసియేట్ అధ్యక్షుడు కే దశరథ్, కోశాధికారి బీ సైదులు, నాయకులు కిశోర్, నవీన్, గంగాధర్, నర్సింములు, బాశెట్టి నాగవేందర్, నర్సింహ తదితరులు ఉన్నారు.