హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగా ణ): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులను మంజూరు చే యాలని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రిత్వశాఖ పరిధిలోని ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీకి ప్రభుత్వం మరోసారి విజ్ఞప్తి చేసింది. సోమవారం ఈఏసీ సమావేశంలో ప్రాజెక్టు ఆవశ్యకతను వివరించింది. పర్యావరణ అనుమతులపై గత నెల 27న ఈఏసీ 34వ సమావేశంలోనే సుదీర్ఘ చర్చ జరిగింది. సభ్యులు సందేహాలు లేవనెత్తనడంతోపాటు పర్యావరణ, కమ్యూనిటీ అగ్మెంటేషన్తో పలు అం శాలపై నివేదికలను సమర్పించాలని సూచించింది. ఈఏసీ మార్గదర్శకాల మేరకు ఆయా నివేదికను ఇటీవలే తెలంగాణ సర్కారు సమర్పించింది. దీనిపై ఈఏసీ సంతృప్తిని వ్యక్తం చేసింది. త్వరలోనే దీనిపై నిర్ణయం వెలువడించనున్నది. సమావేశంలో ఈఎన్సీ మురళీధర్, గజ్వేల్ ఈఎన్సీ హరిరాం, సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే, సీఈలు హమీద్ఖాన్, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.