న్యూఢిల్లీ, మార్చి 22: బంగారం ధరలు మరింత దిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గుముఖం పట్టడం, రూపాయి మరింత బలపడటంతో ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.300 తగ్గి రూ.44,270కి చేరింది. అంతకుముందు రోజు ధర రూ.44,570గా ఉన్నది. వెండి ధర సైతం భారీగా తగ్గింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ళు నిలిచిపోవడంతో కిలో వెండి ఏకంగా రూ.1,530 చౌకై రూ.65,320కి పరిమితమైంది. న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,731 డాలర్లకు తగ్గగా, వెండి 25.55 డాలర్ల వద్ద కొనసాగుతున్నది.