టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు
హుజురాబాద్, ఆగస్టు 30: ఉప ఎన్నికల్లో గెలిపించి సేవ చేసే అవకాశం కల్పించాలని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం హుజూరాబాద్లోని 3, 18వ వార్డుల్లో కడపకడపకూ ప్రచారం నిర్వహించారు. పింఛన్ పొందే వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు గెల్లు శ్రీనివాస్ను నిండు మనసుతో ఆశీర్వదించారు. కౌన్సిలర్ ప్రతాప మంజుల మహిళలకు బొట్టుపెడుతూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి వివరించారు. వాడవాడలా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.