హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మాడల్ స్కూళ్ల టీచర్లకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో హెల్త్కార్డులివ్వాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని ప్రోగ్రెసివ్ మాడల్ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్ (పీఎంటీఏ టీఎస్) ప్రభుత్వాన్ని కోరింది.
ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీశ్, ప్రధానకార్యదర్శి అనుముల పోచయ్య సోమవారం సచివాలయంలో సీఎస్ శాంతికుమారిని కలిసి వినతిపత్రం అందజేశారు. టీఎస్జీఎల్ఐని పునరుద్ధరించాలని, 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని కోరారు.