హైదరాబాద్, సెప్టెంబర్1 (నమస్తే తెలంగాణ): పోలవరం ప్రాజెక్టు వద్ద ఈ ఏడాది నమోదైన గోదావరి ప్రవాహాలకు సంబంధించిన సమాచారాన్ని అందజేయాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది.
ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)కి తెలంగాణ మరోసారి లేఖ రాసింది. ప్రాజెక్టు వద్ద ఏ రోజున ఎంత వరద వచ్చింది? ఏ మేరకు దిగువకు విడుదల చేశారు? క్రస్ట్ గేట్ల ఆపరేషన్ తదితర సమగ్ర సమాచారాన్ని అందజేయాలని పీపీఏకు తెలంగాణ ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేసింది. తాజాగా మరోసారి లేఖ రాసింది.