పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి ఆదేశం
హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): ఎఫ్సీఐకి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ఇవ్వడంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి ప్రతినెలా 10 లక్షల టన్నుల సీఎంఆర్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా మేనేజర్లను పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. ప్రస్తుత యాసంగిలో సీఎంఆర్ రైస్ ఇవ్వడంపై సోమవారం ఆయన సివిల్సైప్లె భవన్లో సమీక్ష నిర్వహించారు. ఎఫ్సీఐ క్షేత్రస్థాయి పరిశీలనను త్వరగా ముగించి తిరిగి మిల్లింగ్ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.