మోమిన్పేట: రసాయన ఎరువుల నుంచి పంట పొలాలను రక్షించాలి అంటూ కామారెడ్డి జిల్లా సర్దాపూర్ బాలిక వెన్నెల చేపట్టిన సైకిల్ యాత్ర సోమవారం వికారాబాద్ జిల్లా మోమిన్పేటకు చేరింది. ఈ సందర్భంగా మండలాధ్యక్షుడు వెంకట్ ఆమెకు స్వాగతం పలికి సన్మానించారు. సహజమైన ఎరువులపై రైతులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో సైకిల్ యాత్ర కొనసాగిస్తానని వెన్నెల తెలిపారు.