రాజన్న సిరిసిల్ల : ముస్తాబాద్ మండల కేంద్రంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడశిశువును రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు తల్లిదండ్రులు. శిశువును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని శిశువును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ పాపను ఐసీడీఎస్ అధికారులకు అప్పగించగా, ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాప బరువు మూడున్నర కిలోలు ఉండగా, శిశువు ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు. పసికందు తల్లిదండ్రుల ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.