వికారాబాద్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి చేతిలో ఓ బాలిక హత్యకు గురైంది. ఈ విషాదకర సంఘటన పూడూరు మండలం అంగడిచిట్టంపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం ఊరి బయటకు వెళ్లిన బాలికను గుర్తు తెలియని యువకుడు హత్య చేశాడు. రాయితో మోది బాలికను చంపేసిన యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు.
కాగా… ఈ ఘటనకు సంబంధించి బాలిక కుటుంబ సభ్యులు అనుమానం ఓ యువకుడిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డను ప్రేమ పేరుతో వేధించేవాడని, అతడు, అతడి స్నేహితుల బాలిక మృతికి కారణమమని ఆరోపించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు చేసి దర్యాప్తు చేపట్టారు.