హైదరాబాద్: మంత్రి కేటీఆర్ చేపట్టిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తన బర్త్డేకు ఎవరు గిఫ్టులు తేవొద్దని, నిరుపేదల ముఖాల్లో చిరునవ్వులు చిందేలా బహుమతులు అందించాలని పిలునిచ్చిన విషయం తెలిసిందే. మంత్రి పిలుపుతో ఎంతో మంది ప్రజాప్రతినిధులు ముందుకొచ్చి అంబులెన్సులు, మందులు విరాళంగా అందజేశారు.
అందులో భాంగంగా సోమవారం రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కె.వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో అతడి మిత్రుడు వెంకటేశ్వర్ రెడ్డి రూ.10లక్షల రూపాయల చెక్ను ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్కు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరు వారికి అందుబాటులో ఉన్న దివ్యాంగులకు ఏదో ఒక సహాయం చెయ్యాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : పెద్దాపూర్లో పిడుగు పాటుకు ఇద్దరు మృతి
Biggboss Season 5 Telugu| రెండో వారం నామినేషన్స్లో ఉన్నది వీళ్లేనా..?