హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : పేపర్ లీక్లు, అమ్మకాల సమాచారం తనకు తెలియదని టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు. మూడు పేపర్ లీకులు, ఆరు పశ్నపత్రాల అమ్మకాలు అంటూ కాంగ్రెస్ నాయకుడు అనిల్ ఈరవత్రి చేసిన వ్యాఖ్యలపై ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించారు. తన హయాంలో అలాంటివి జరుగలేదని, జరిగినట్టు సమాచారం ఉంటే సిట్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. లేకపోతే లీగల్ చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరించారు. ‘నేను మేధావినా, సూడో మేధావినా తర్వాత.
మీరు మాత్రం చైర్మన్గా అపాయింట్మెంట్ కాకపోయినా.. జీవో రాకపోయినా.. ఛార్జ్ తీసుకోకపోయినా.. చైర్మన్ అని రాసుకుని చెలామణి అవుతున్నారు. సూడో అంటే అర్థం అదే. చట్టరీత్యా అది నేరం. కాంగ్రెస్ పార్టీ, రేవంత్రెడ్డి మీకు ఎంత తెలుసో తెలియదుగానీ, నాకు మాత్రం బాగానే తెలుసు. మర్యాదగా మాట్లాడండి. ఎక్స్ట్రాలు వద్దు’ అని ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ట్వీట్ చేశారు.