హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు దేవనపల్లి రాంకిషన్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మేడె రాజీవ్ సాగర్ మాట్లాడుతూ.. నిరంతరం ప్రజాసేవలో పరితపించే రాంకిషన్ రావు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
అనంతరం బసవతారకం క్యాన్సర్ దవాఖాన వద్ద జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజీవ్ సాగర్, నరేందర్ యాదవ్, జాగృతి జీహెచ్ఎంసీ కో కన్వీనర్, శ్రవణ్ కుమార్ జూబ్లీ హిల్స్ కన్వీనర్, శ్రీనివాస్ యూసుఫ్ గూడ, రాజేష్, నరేశ్, హెల్పింగ్ హాండ్స్ సొసైటీ సభ్యులు రాకేష్, ప్రమోద్, రాజేందర్, ఆధ్వర్యంలో నిరుపేదలకు, రోగుల బంధువులకు అన్నదానం చేసారు.
ఇవి కూడా చదవండి..
ఎన్నారైలు ఎల్లప్పుడు సీఎం కేసీఆర్ వెంటే..
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : మొక్కలు నాటిన శ్రీనివాస్ గుప్తా
పీఎంవో వల్ల కాదు కానీ.. ఆ పని గడ్కరీకి అప్పగించండి: ప్రధానికి స్వామి సూచన