హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం తన నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించిన అఫడవిట్లో ఆయన తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. చరాస్తులు రూ.2,82,402.44 కాగా, స్థిరాస్తుల విలువ రూ.20,00,000గా పేర్కొన్నారు. ఆయన ఏడాది సంపాదన కేవలం రూ. 4.98 లక్షలు.
2020-21లో గెల్లు శ్రీనివాస్ సంపాదన రూ. 3.13 లక్షలు ఉండగా.. 2021లో 4.98 లక్షలకు చేరింది. ఆయన భార్య స్వేత ఏదాది సంపాదన కూడా కేవలం లక్షల్లోనే ఉంది. 2020-21లో ఆమె సంపాదన రూ. 4.50 లక్షలు ఉండగా, 2021లో 4.60 లక్షలకు చేరింది. తన ఆస్తులు, సంపాదనతో పాటుగా.. తనపై ఉద్యమకాలం నుంచి ఉన్న కేసుల వివరాలు కూడా పొందుపర్చారు గెల్లు శ్రీనివాస్ యాదవ్.
గెల్లు ప్రత్యర్థి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఏడాది సంపాదన కోట్ల రూపాయల్లోనే ఉండనుందనేది జగమెరిగిన సత్యం. అందులోనూ అక్రమంగా సంపాదించిన ఆస్తులను కాపాడుకునేందుకే ఆయన బీజేపీలోకి చేరాడన్న ఆరోపణలు ఉన్నాయి.