అతి సామాన్యుడైన గెల్లు శ్రీనివాస్ యాదవ్కు, అక్రమాలతో అపర కుబేరుడిగా మారిన ఈటల రాజేందర్కు మధ్య జరుగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికపోరు జోరందుకుంది. అయితే, ప్రజల మనిషిగా, వారి కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రతి గడపనూ ముద్దాడుతున్నారు.
కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామస్తులు భారీ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా స్థానిక కోలాటం కళాకారులతో కలిసి కోలాటం ఆడారు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్. ఆద్యాంతం కోలాహలంగా సాగిన కోలాట నృత్యం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆయన అభిమానులు ఆ వీడియోను పలు సోషల్ మీడియా వేదికల్లో షేర్ చేస్తున్నారు.