హుజూరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి హిమ్మత్నగర్లోని పోలింగ్ బూత్లో ఓటు వేశారు. ప్రతిఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. అంతకుముందు గెల్లు శ్రీనివాస్ దంపతులు ఇంట్లో దేవుడికి ప్రత్యేక పూజలు చేశారు. తల్లి పాదాలకు నమస్కరించి పోలింగ్ కేంద్రానికి బయల్దేరారు.
హుజూరాబాద్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నది. భారీగా పోలింగ్ నమోదవుతున్నది. ఉదయం 11 గంటల వరకు 33.27 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.