ఆరు సార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పదవిలో ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని పట్టించుకోని ఈటల రాజేందర్.. రేపు ఎమ్మెల్యేగా గెలిస్తే ఏం ఉద్ధరిస్తాడని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ అన్నారు. ఆదివారం జమ్మికుంట తెలంగాణ చౌరస్తాలో నిర్వహించిన టీఆర్ఎస్ ధూంధాం కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి పాల్గొన్నారు. పేదింటి బిడ్డను ఆశీర్వదించాలని, హుజూరాబాద్ నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. జమ్మికుంటకు మాస్టర్ ప్లాన్ తెస్తానని, ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు.