హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): డాక్టర్ వీరేంద్రసింగ్ చౌహాన్ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం నూతన కులపతి (చాన్స్లర్)గా నియమితులయ్యారు. జెనెటిక్ (జన్యు) ఇంజినీరింగ్, బయోటెక్నాలజీలో విశేష సేవలు అందించి, మలేరియా వ్యాక్సిన్ అభివృద్ధికి కృషిచేసిన వీఎస్ చౌహన్ ఈ బాధ్యతలు చేపట్టడం గొప్ప గౌరవంగా భావిస్తున్నామని గీతం యాజమాన్యం పేర్కొన్నది. ఈ మేరకు గీతం అధ్యక్షుడు ఎం శ్రీభరత్ గురువారం న్యూఢిల్లీలోని చౌహాన్ ఇంటికెళ్లి నియామకపత్రాన్ని అందజేశారు.