హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): నేడు ప్రపంచంలో అత్యంత ధనికుడిగా పేరు తెచ్చుకొని పలు ఆరోపణలపై కొద్దిరోజులుగా పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కుతున్న పారిశ్రామికవేత్త అదానీ పేరు తొమ్మిదేండ్ల క్రితం ఎక్కడా మచ్చుకైనా కనిపించలేదని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ అప్పట్లో ప్రస్తావించిన ధనికుల పేర్లలో ఆయన పేరు లేకపోవడమే ఇందుకు నిదర్శనమని గుర్తుచేశారు.
కేటీఆర్ తన ట్వీట్కు మద్దతుగా 2013లో ప్రధాని మోదీ చేసిన ఓ ట్వీట్ను ట్యాగ్చేశారు. అందులో మోదీ ప్రస్తావించిన ధనికుల పేర్లలో అదానీ పేరు లేకపోవడం విశేషం. ప్రభుత్వం టాటా, బిర్లా, అంబా నీ వారి కోసం కాదని, పేదలకు ఉపయోగపడాలని మోదీ అప్పటి తన ట్వీట్లో పేర్కొన్నారు.