పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో ఎల్పీజీ కొరత ఏర్పడిందన్న భయాందోళనకు తోడు బుకింగ్, సరఫరాల్లో సాంకేతిక చిక్కులు తలెత్తాయి. దీంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ ఎదుట ఖాళీ సిలిండర్లతో దాదాపు అర కిలోమీటర్ మేర క్యూ కనిపించింది. ఏజెన్సీకి 504 సిలిండర్లు సరఫరా కావడంతో.. అందని వారు నిరాశతో వెనుదిరిగారు.
ఆదిలాబాద్ జిల్లావాసులను గ్యాస్ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తిరుపెల్లిలో గల గ్యాస్ ఏజెన్సీతోపాటు వ్యవసాయ మార్కెట్ ఎదుట గల ఏజెన్సీ వద్ద ఖాళీ సిలిండర్లతో వినియోగదారులు బారులుతీరారు.