శంకరపట్నం, ఫిబ్రవరి 15: ఇటీవల ఎల్లిగడ్డ ధరలు పెరిగిపోవడంతో దొంగలు పంట చేన్లలో చోరీ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కన్నాపూర్ గ్రామంలో ఎల్లిగడ్డను గుర్తుతెలియని వ్యక్తులు పొలంలో నుంచే ఎల్లిగడ్డ పంటను పీక్కొని పోయారు. గ్రామానికి చెందిన రైతు గుండెవేని శంకర్ గ్రామ శివారులోని ఓ గుంట మడిలో ఎల్లిగడ్డ సాగు చేశాడు. పంట ఇటీవల కోతకు రాగా దొంగలు రాత్రి సమయంలో పంట కోసుకువెళ్లారు. దీని విలువ దాదాపు రూ.40 వేలు ఉంటుందని, తనకు న్యాయం చేయాలని బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.