కరీంనగర్ ముకరంపుర, సెప్టెంబర్ 22: మంత్రి గంగుల కమలాకర్ మరోమారు ఔదార్యాన్ని ప్రదర్శించారు. కరీంనగర్ నియోజకవర్గంలోని వినాయక మండపాల విద్యుత్తు బిల్లులను మంత్రి సొంతంగా భరించారు. శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ గంగాధర్కు రూ.4 లక్షల చెక్కును అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. గణేశ్ నవరాత్రోత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ప్రజలను కోరారు. విద్యుత్తు సరఫరా విషయంలో మండపాల నిర్వాహకులను ఇబ్బందిపెట్టవద్దని విద్యుత్తు అధికారులకు సూచించారు.