హైదరాబాద్, సెప్టెంబర్2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 90.34 లక్షల రేషన్కార్డులు ఉంటే, అందులో 59 శాతం కార్డులకే కేంద్రం బియ్యం పంపిణీ చేస్తున్నదని, అది కూడా ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున మాత్రమే ఇస్తున్నదని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టంచేశారు. ఈ విషయం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు తెలియదా? అంటూ శుక్రవారం కామారెడ్డి పర్యటనలో ఆమె చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. కేంద్రం కిలోకు రూ.3 చొప్పున ఇస్తుంటే, రాష్ట్రం రూ.2 చొప్పున భరిస్తున్నదని తెలిపారు. అదనపు కిలోకు రాష్ట్ర ప్రభుత్వం రూ.33 వెచ్చిస్తున్నదని, ఏటా రూ.372 కోట్లు ఖర్చు పెడుతున్నదని వివరించారు.
కేంద్రం పట్టించుకోకుండా వదిలేసిన 95 లక్షల మంది నిరుపేదలకు ఎలాంటి పరిమితులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే రేషన్ అందిస్తున్నదని తెలిపారు. అందుకు నెల కు రూ.300 కోట్ల చొప్పు న ఏటా రూ.3,610 కోట్లు రాష్ట్రమే భరిస్తున్నదని వివరించారు. దాదాపు 8 లక్షల టన్నుల బియ్యాన్ని ఇస్తున్న విషయాన్ని ఒప్పుకోవడానికి కేంద్ర పెద్దలకు అభ్యంతరమేంటని కేంద్ర మంత్రిని ప్రశ్నించారు. కలెక్టర్ జిల్లా కార్యనిర్వాహణాధికారి అనే విషయాన్ని మరిచి కేంద్ర మంత్రి హోదాలో అమర్యాదగా ప్రవర్తించడం మంచిది కాదని హితవు చెప్పారు. ఇలాంటి చర్యలు ఉద్యోగుల ైస్థెర్యాన్ని దెబ్బతీస్తాయని పేర్కొన్నారు.