నిర్మల్ అర్బన్ : నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అడెల్లిలో గంగనీళ్ల జాతరను ఆదివారం వైభవంగా నిర్వహించారు. దిలావర్పూర్ నుంచి అడెల్లి వరకు ఊరేగింపుగా వెళ్లిన భక్తులు మహాపోచమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు.