రామగిరి, మార్చి 10 : ధూప, దీప నైవేద్య అర్చకులకు డీడీఎన్ స్కీమ్ పదాన్ని తొలగించి దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకురావాలని తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ ప్రభుత్వాన్ని కోరారు.
డీఎన్ఎన్ అర్చక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, జిల్లా వైదిక బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు, జాతీయ ఉత్తమ అర్చక అవార్డు గ్రహీ త పెన్నా మోహనశర్మ ఆధ్వర్యంలో ముద్రించిన ‘పరాభవ’ నామ తెలుగు నూతన సంవత్సర పంచాంగం ఆవిష్కరణ నల్లగొండలోని రాక్హిల్స్కాలనీలో మంగళవారం నిర్వహించారు. పంచాంగాన్ని ముద్రించి అర్చక, బ్రాహ్మణులకు ఉచితంగా అందజేస్తున్న పెన్నా మోహనశర్మ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా, మేయర్ శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.