జమ్మికుంట, ఏప్రిల్ 6: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో దారుణం జరిగింది. ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై ఎనిమిది నెలలుగా లైంగిక దాడి జరుగుతున్నట్టు తెలిసింది. బాలిక తల్లి ఫిర్యాదుతో 13 మందిపై పోక్సో కేసు నమోదైంది. జమ్మికుంటకు చెంది న ఓ మహిళ భర్త చనిపోగా కొడుకు, కూతురితో కలిసి స్థానికంగానే నివాసం ఉంటున్నది. కూతురు 8వ తరగతి చదువుతున్నది. ఆ బాలిక గతంలో వేరే ప్రైవే ట్ పాఠశాలలో చదువగా, ఈ ఏడాది మరో స్కూల్లో చేరింది. ఈ క్రమంలో పాత, ప్రస్తుత పాఠశాలలకు చెందిన కొందరు ఉపాధ్యాయులు, సిబ్బందితోపాటు బాలిక దూరపు బంధువులు లైంగికదాడి చేస్తున్నారు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించారు. కొద్దిరోజులుగా బాలిక ప్రవర్తనలో మార్పు రావడంతో తల్లి ఆరా తీసింది. ఈ విషయమై బాలిక, ఆమె తల్లి జమ్మికుంట పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశా రు. దీంతో 13 మందిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
లైంగికదాడి కేసులో 20 ఏండ్ల జైలు
వరంగల్ లీగల్, ఏప్రిల్ 6 : బాలికను ప్రేమ పేరుతో లొంగదీసుకొని లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి శిక్ష ఖరారు చేస్తూ హనుమకొండ పోక్సో చట్టం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సో మవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం..కాజీపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన రఫీక్ అలియాస్ ఆకాశ్ ప్రేమ పేరుతో లొంగదీసుకొని లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక కనిపించడం లేదని తండ్రి 25 అక్టోబర్ 2020న ఫిర్యాదు చేయగా మ డికొండ పోలీసులు విచారిస్తున్న క్రమం లో నిందితుడు ఆమెను 27 అక్టోబర్ 2020న గ్రామంలో వదిలి పారిపోయా డు. అప్పటి కాజీపేట ఏసీపీ రవీంద్రకుమార్ నిందితుడిపై లైంగికదాడి, పోక్సో చట్టం కింద కేసు న మోదు చేసి చార్జిషీటు దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో 20 ఏండ్ల కఠిన కా రాగార శిక్షతోపాటు రూ.14 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చె ప్పారు. బాధితురాలికి రూ.2 లక్షల హా రం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.