రెంజల్, మార్చి 11: బీఆర్ఎస్కు మహారాష్ట్రలో మంచి ఆదరణ లభిస్తున్నదని నాందేడ్కు చెందిన ఆ పార్టీ సీనియర్ నేత గణేశ్ కదం అన్నారు. ‘అబ్కీ బార్.. కిసాన్ సర్కార్’ నినాదంతోపాటు తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనకు ఆకర్షితులై మరాఠా ప్రజలు బీఆర్ఎస్లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని తెలిపారు. శనివారం నాందేడ్లోని ఐదు ప్రాంతాల్లో పార్టీ ఆఫీసులను ప్రారంభించి, కార్యకర్తలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా బీజేపీ, శివసేన, కాంగ్రెస్లకు చెందిన కార్యకర్తలు గణేశ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. ఆయన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం గణేశ్ కదం మాట్లాడుతూ.. పార్టీ పటిష్టత కోసం ప్రతి ఒక్కరూ సైనికుడిలా పనిచేయాలని సూచించారు. త్వరలో జరగబోయే జిల్లా పరిషత్ ఎన్నికల్లో జడ్పీ పీఠంపై గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.