హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ప్రజారోగ్య పరిరక్షణలో నిర్లక్ష్యం వహించే వైద్యసిబ్బందిపై చర్యలు తప్పవని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు హెచ్చరించారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తున్నాయని, దర్యాప్తు నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వైద్యారోగ్య శాఖకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు పెంచి, అన్ని సదుపాయాలను కల్పిస్తున్నదని, వైద్యసిబ్బంది నుంచి మంచి పనితీరును ఆశిస్తున్నదని తెలిపారు. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా వైద్య సిబ్బంది పనిచేయాలని, చక్కగా పనిచేసేవారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు.
సోమవారం ఆయన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, హెల్త్ సూపర్ వైజర్లు, మెడికల్ ఆఫీసర్లు, డిప్యూటీ డీఎంహెచ్వోలు, డీఎంహెచ్వోలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సిజేరియన్లను 62 నుంచి 56 శాతానికి తగ్గించామన్నారు. వీటిని 40 శాతానికి తగ్గించాలని కోరారు. సాధారణ ప్రసవాలను మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందజేస్తున్నదని, ఆగస్టు నెలకు రూ.16 లక్షలు విడుదల చేసిందని తెలిపారు. సాధారణ కాన్పులో భాగస్వాములైన సిబ్బంది అందరికీ ఇవి అందుతాయని చెప్పారు. జిల్లాలు, పీహెచ్సీలవారీగా సిజేరియన్ల తీరు, సీజనల్ వ్యాధుల గురించి మంత్రి హరీశ్రావు ఆరా తీశారు. బాగా పని చేసిన ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైద్యులను పేరు పేరునా పలకరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డీపీహెచ్ శ్రీనివాసరావు, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ శ్వేతా మహంతి తదితరులు పాల్గొన్నారు.
హరీశ్రావు పేర్కొన్న ముఖ్యాంశాలు