హైదరాబాద్ నడిబొడ్డున గాంధీజీకి గుర్తుగా ‘జ్ఞాన మందిర్’ను 1974, అక్టోబర్ 2న ప్రారంభించారు. ఈ మందిర్ను ‘సర్వోదయ విచార్ ప్రచార ట్రస్ట్’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. 1951-52లో హైదరాబాద్ను సందర్శించిన ఆచార్య వినోబా భావే సహకారంతో ఈ మందిర్ నిర్మాణానికి బీజాలుపడ్డాయి. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్.. సుల్తాన్ బజార్లోని తిలక్ పార్క్ వద్ద విలువైన స్థలాన్ని ట్రస్ట్కు కేటాయించింది. “గాంధీ జ్ఞాన మందిర్” భవనానికి సరిహద్దు గాంధీ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ 1969, 27 డిసెంబర్ న శంకుస్థాపన చేశారు. నైతిక విలువలను పెంపొందించడం, గాంధీజీ భావజాలవ్యాప్తితోపాటు యోగా శిక్షణలాంటి కార్యక్రమాలకు కేంద్రంగా ఈ మందిర్ పనిచేస్తున్నది.
నా దృష్టిలో మతాలన్నీ ఒకే తోటలోని అందమైన పువ్వులు లేదా మహోన్నతమైన వృక్షానికి కొమ్మల్లాంటివి. అంటే అన్నింటిలో సత్యం సమానంగా ఉంటుంది. కాకపోతే మానవ వివేచన ఆ సత్యాన్ని తెలుసుకొన్న తీరు, దానిని వ్యాఖ్యానించిన విధానం అసమగ్రంగా ఉండొచ్చు.
-మహాత్మాగాంధీ