గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లిలో ఎన్నడూ లేని విధంగా తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. నల్లా నీరు రాకపోవడంతో ప్రతి ఒక్కరూ తాగడానికి, గృహ అవసరాల కోసం ఇంటి ముందు డ్రమ్ములు ఏర్పాటు చేసుకుంటూ జీపీ ట్యాంకర్ ద్వారా వచ్చే నీటితో నింపుకుంటున్నారు.
గతంలో ప్రతి రోజూ మిషన్ భగీరథ నల్లా ద్వారా కుటుంబానికి సరిపోయేంత నీరు వచ్చేదని, ఇప్పుడు ట్యాంకర్ ద్వారా డ్రమ్ము నీటితో మూడు రోజులు సరిపెట్టుకునే పరిస్థితి వచ్చిందని గ్రామస్తులు వాపోతున్నారు. కాంగ్రెస్ వస్తే ఇలాంటి మార్పు వస్తుందనుకోలేదని మండిపడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి తాగు నీటి కష్టాలు తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు.