హైదరాబాద్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్పై తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గజ్జల కాంతం ఫైర్ అయ్యారు. బీసీని అని చెప్పుకునే ఈటల రాజేందర్ ఇంట్లో ఎవరూ బీసీలు లేరు అని, అందరూ అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులేనని మండిపడ్డారు. ఈటల ప్రమాదకరమైన వ్యక్తి అని పేర్కొన్నారు. కుట్రలు, కుతంత్రాలతో బీసీలను అణిచివేసిన వ్యక్తి అని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ ఈటలను గౌరవించి, పలు పదవులు కట్టబెట్టారు అని తెలిపారు. ఉద్యమ సమయంలో ఉద్యమకారులను దూరం పెట్టిన చరిత్ర ఈటల రాజేందర్ది. నాడు ఉద్యమకారులను మోసం చేసిన ఈటల రాజేందర్కు ఇప్పుడు అదే జరిగిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను అణిచివేస్తున్న బీజేపీలోకి ఈటల రాజేందర్ వెళ్లడం దారుణమన్నారు.