జోగులాంబ గద్వాల : ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో(MLC by-election) గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి(MLA Krishna Mohan Reddy) ఓటు హక్కు వినియోగించుకుననారు. గురువారం గద్వాల జిల్లా కేంద్రంలోని ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందర్భంగా స్థానిక తన ఓటు హక్కును జడ్పీ కార్యాలయం సమావేశం మందిరంలో వినియోగించుకున్నారు. ఎన్నికల కేంద్రంలో జరుగుతున్న ఓటింగ్ సందర్భంగా తన ఓటు వేశారు.
ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలుపు ఖాయం అని అన్నారు. ఎమ్మెల్యే వెంటనే ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. కాగా, మహబూబ్ నగర్ స్థానిక సంస్థల శాసన మండలి ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఊప ఎన్నిక పోలింగ్ను సమీకృత కలెక్టరేట్ కంట్రోల్ రూం వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ జి.రవి నాయక్,అదనపు కలెక్టర్లతో కలిసి పర్యవేక్షించారు.