హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టీఈఏ) రాష్ట్ర అధ్యక్షురాలిగా జీ నిర్మల ఎన్నికయ్యారు.
ఆదివారం హైదరాబాద్లో జరిగిన సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు చిలగాని సంపత్కుమార్ స్వామి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయగా, నూతన అధ్యక్షురాలిగా నిర్మలను ఎన్నుకున్నారు. రాష్ట్ర సెక్రటరీ జనరల్గా ఎఫ్ఏ యాకుబ్పాషా, కోశాధికారిగా జీ ఆనందం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.