హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): జీ20 ఆర్థిక సదస్సు హైదరాబాద్ హెచ్ఐసీసీలో శనివారం ప్రారంభమైంది. మూడురోజులపాటు జరిగే సదస్సుకు 40 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సదస్సులో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్థిక వ్యవస్థ, భవిష్యత్తు ప్రణాళిక,
జీ20 యేతర దేశాల భాగస్వామ్యం, జీ20తోపాటు ఇతర దేశాల్లో డిజిటల్ చెల్లింపులు తదితర అంశాల గురించి చర్చిస్తున్నట్టు జీ20 ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ హర్షవర్ధన్ ష్రింగ్లా చెప్పారు. ‘గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఫైనాన్సియల్ ఇన్క్లూజన్ (జీపీఎఫ్ఐ)’ ప్రధాన సమావేశాలు సోమ, మంగళవారాల్లో జరుగనున్నాయి.