Etamatam |రాజన్న రాజ్యం పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ గడ్డపై రాయలసీమ రాజ్యాన్ని స్థాపించేందుకు పాదాల మీద నడిచే పాదయాత్ర చేసినా జనం పట్టించుకోలేదు. మోకాళ్ల మీద దేకుతూ తిరిగినా ఫలితం లేదని అర్థం అయింది. అప్పుడేమో హైదరాబాద్ వెళ్లాలంటే వీసా కావాలా? అని అడిగి, ఇప్పుడేమో నేను నగరంలోనే పుట్టిన, మెహిదీపట్నంలో చదివిన, మ్యారేజ్ ఇక్కడే, సంతానం ఇక్కడే అని షర్మిల చాటింపు వేసినా ఫలితం లేకపాయె.
దీంతో తన బిడ్డ నెత్తిన సాడేసాత్ ఏమైనా కూర్చుందా? అని తల్లి విజయమ్మ ఒంగోలు వెళ్లి జ్యోతిషుణ్ని అడిగారట. పార్టీ నడపడం కన్నా కాంగ్రెస్లో కలిపితే షర్మిలకు లాభం.. ఆ పార్టీకి నష్టం అని సెలవు ఇచ్చారట ఆయన. ఆ విలీనం కూడా చివర్లో ఆగింది. ఇక ఒంటరిగానే పోటీ చేయబోతున్నారు.. కనీసం బీ ఫారాలకైనా ముహూర్తం పెట్టండని అడిగారట. తిరుగు ప్రయాణంలో విజయమ్మ కారుకు తృటిలో ప్రమాదం తప్పింది. దీంతో ఏం చేసినా అక్కకు అచ్చొస్తలేదని జై షర్మిలక్క బ్యాచ్ వాపోతున్నది!