AP News | హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): తిరుపతిలో అరుదైన ఘటన చోటుచేసుకొన్నది. పెంపుడు శునకం మృతి చెందటాన్ని జీర్ణించుకోలేని యజమాని దాము.. హిందూ సంప్రదాయం మంగళవారం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పెంపుడు శునకం విక్కీని చికిత్స కోసం తిరుపతి పశువైద్య దవాఖానకు తీసుకెళ్లారు. కాగా, అక్కడ చికిత్స పొందుతూ శునకం (విక్కీ) మరణించింది. అయితే.. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన శునకం మరణించిందని యజమాని దాము ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పశువైద్య కౌన్సిల్, కలెక్టర్, పోలీసులకు ఫిర్యాదు చేశారు.