హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): భారతమాల ఫేజ్-1 కింద కేంద్రం నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) భూసేకరణ వ్యయంలో 50% నిధులను భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కు జమ చేయాలని సీఎం రేవంత్రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం రెండు లేఖలు రాశారు. రూ. 26 వేల కోట్లకు పైగా అంచనా వ్యయంతో తెలంగాణకే తలమానికంగా నిలిచేలా హైదరాబాద్ నగరం చుట్టూ 350 కిలోమీటర్ల పొడవున రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అయ్యే ఖర్చును కేంద్రం పూర్తిగా భరిస్తున్నదని తెలిపారు.