హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 4 (నమస్తే తెలంగాణ): గులియన్బేరీ సిండ్రోమ్(జీబీఎస్) వ్యాధి బారిన పడుతున్న చిన్నారులకు నిలోఫర్ వైద్యులు ప్రాణం పోస్తున్నారు. ఎంతో ఖరీదైన ఈ వ్యాధి చికిత్సను ఉచితంగా అందిస్తున్నారు. వైరల్ జ్వరాలు, వైరల్ ఇన్ఫెక్షన్లు సోకిన పిల్లలకు జీబీఎస్ వచ్చే అవకాశం ఉంటుందని, ఫలితంగా నాడీ వ్యవస్థ దెబ్బతిని కండ్లు వాలిపోవడం, చేతులు పడిపోవడం, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులొస్తాయని వైద్యులు పే ర్కొన్నారు. జీబీఎస్ సోకిన 100 మంది లో ఇద్దరు మృతి చెందే అవకాశం ఉం టుందని తెలిపారు. ఈ వ్యాధికి ఐదు నుంచి వారం పాటు అందించే చికిత్సకు ప్రైవేటు దవాఖానలో రోజుకు రూ.5 వేల నుంచి రూ.10వేల వరకు ఖర్చవుతుందని చెప్పారు.
లక్ష మందిలో ఒకరికి
గులియన్బేరీ సిండ్రోమ్ లక్ష మందిలో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధి అని, ఈ వ్యాధి ఎందుకు వస్తుందో కచ్చితంగా చెప్పలేమని నిలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి చెప్పారు. రోగికి యాంటిబయాటిక్స్ ఇచ్చినప్పుడు వారి శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి ఉత్తేజితమవుతుందని, అది వ్యాధితోపాటు రోగి నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని, దీనినే ‘ఆటో ఇమ్యూనిటీ’ అంటారని తెలిపారు. ఈ ఆటో ఇమ్యూనిటీ వల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్ తగ్గడంతోపాటు నాడీ వ్యవస్థ బలహీనపడి, రోగి నీరసించిపోవడం, నిర్లక్ష్యం చేస్తే కాళ్లు చేతులు పడిపోవడం, శ్వాససమస్య, పక్షవాతం సమస్యలతో పిల్లలు మృతిచెందవచ్చని ఉంటుందని వివరించారు.
నెలకు నాలుగు కేసులు
జీబీఎస్కు చికిత్స ఖరీదైనది కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి కేసులు నిలోఫర్కు వస్తున్నాయని డాక్టర్ ఉషారాణి చెప్పారు. నెలకు సుమారు నాలుగు కేసులు వస్తున్నాయని తెలిపారు. సకాంలో బాధితులకు చికిత్స అందిస్తే చిన్నారుల ప్రాణాలు కాపాడవచ్చని, కాళ్లు, చేతులు పడిపోయి, శ్వాస సమ స్య ముదిరిన తరువాత రోగికి చికిత్స అందిస్తే ఫలితం ఉండదన్నా రు. ‘ నిలోఫర్లో జీబీఎస్ బాధితులకు ఇమ్యునోగ్లోబిన్స్’ అం దిస్తూ చికిత్స చేస్తాం. ఇమనోగ్లోబన్ ఒక వాయిల్ (5 గ్రాముల బాటిల్) రూ.13 వేల నుంచి రూ.15వేల వరకు ఉం టుంది. రోగి బరువు ఆధారంగా డోస్ ఇస్తాము. నిలోఫర్లో పైసా ఖర్చులేకుండా సురక్షితమైన వైద్యుం అందిస్తున్నాం’ అని చెప్పారు.