హైదరాబాద్ : బ్యాంకర్ల గ్రామీణ, ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ (బైరెడ్) ఆధ్వర్యంలో గ్రామీణ నిరుద్యోగ యువకులకు 40 రోజుల పాటు ఉచిత ఉపాధి శిక్షణా కార్యక్రమాలు ఇవ్వనున్నట్లుగా డైరెక్టర్ విజయలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. 40 రోజుల పాటు ఉచిత ఉపాధి శిక్షణ కార్యక్రమాల్ని జూలై 4 నుంచి ఆగస్టు 10 వరకు వరకు శిక్షణ ఇవ్వనున్నట్లుగా పేర్కొన్నారు.
పదో తరగతి పాసైన వారికి మొబైల్ సర్వీసింగ్లో, ఫెయిల్ అయిన వారికి ఎలక్ట్రీషియన్, పంపు సెట్ రిపేర్, బీ.కామ్ పాస్ అయిన వారికి అకౌంటింగ్ ప్యాకేజీ జీఎస్టీపై, ఇంటర్ పాస్ అయిన వారికి ఎంఎస్ ఆఫీస్లో శిక్షణ ఇవ్వనున్నట్లుగా తెలిపారు. అభ్యర్థులు 19 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలన్నారు.
శిక్షణా కాలంలో వసతి, భోజనం, శిక్షణ పూర్తిగా ఉచితంగా కల్పించడం జరుగుతుందన్నారు. శిక్షణ కాలంలో అభ్యర్థులకు రవాణా ఛార్జీలు సైతం ఇవ్వనున్నట్లు వివరించారు. అభ్యర్థులు www.bired.orgలో ఆన్లైన్లో ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.