హైదరాబాద్, డిసెంబర్ 21(నమస్తే తెలంగాణ): ఉచిత విద్యుత్తును ప్రవేశపెట్టిన ఘనత వైఎస్దేనని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. 24 గంటల కరెంటును బీఆర్ఎస్ తమ పేటెంట్గా చెప్పుకుంటున్నప్పటికీ అది వాస్తవం కాదని చెప్పారు. ఉచిత విద్యుత్తుకు చంద్రబాబు హయాంలో 2001లోనే బీజం పడిందని అన్నారు. గురువారం అసెంబ్లీలో విద్యుత్తుపై చర్చ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ.. ‘గతంలో మహబూబ్నగర్లో ఒకే గ్రామంలో 300 మంది రైతుల మీటర్ల స్టార్టర్లు, మీటర్లు అధికారులు తీసుకొని వెళ్లారు.
అప్పుడు నేను ఆందోళన చేస్తే నన్ను జైల్లో పెట్టారు. ఆంధ్రా రైతాంగానికి ఉచితంగా నీళ్లు ఇస్తున్నప్పుడు తెలంగాణ రైతులకు ఉచిత విద్యుత్తు ఎందుకు ఇవ్వకూడదని అప్పటి కాంగ్రెస్ నేత వైఎస్సార్ను ప్రశ్నించాను. అనంతరం 2004లో కాంగ్రెస్ అధికారంలో వచ్చాక రైతుల విద్యుత్తు బకాయిలు రద్దుచేయడంతోపాటు అప్పుడే ఉచిత విద్యుత్తును ప్రవేశపెట్టారు. ఏడాడూ 24 గంటలు విద్యుత్తు సరఫరా చేయలేదు. ఉచిత కరెంటు కాంగ్రెస్ సర్కారే ప్రవేశపెట్టింది’ అని వివరించారు.