సిద్దిపేట : జిల్లాలోని వర్గల్ మండల కేంద్రంలో గల మల్లిఖార్జున ఫంక్షన్ హాల్లో రాష్ట్ర పశు వైద్య, పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో సామూహిక గొర్రెలు, మేకలలో ఉచిత నట్టల నివారణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గొర్రెలు, మేకలలో ఉచిత నట్టల నివారణకు మందులు పంపిణీ చేసి కార్యక్రమాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు.