పల్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి వెల్లడి
హనుమకొండ, మే 8: నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఉద్యోగార్థుల కోసం పల్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనురాగ్ విశ్వవిద్యాలయం సహకారంతో హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురం సమీపంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల భారీగా ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు జారీ చేసినందున నిరుద్యోగ యువతకు ఉపయోగపడేలా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు.
సర్కారు ప్రభుత్వంతోపాటు ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నదని తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కోచింగ్తోపాటు మధ్యాహ్న భోజనం కూడా ఏర్పా టు చేస్తున్నట్టు తెలిపారు. కోచింగ్కి వచ్చే విద్యార్థులకు నాణ్యమైన శిక్షణతోపాటుగా ఉచిత స్టడీ మెటీరియల్ ఇవ్వనున్నట్టు చెప్పారు. ఇప్పటికే 300 మంది ఉద్యోగార్థులు కోచింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకొన్నారని, వీరందరికీ రేపటి నుంచి రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు నైపుణ్యం కలిగిన, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీలు తరగతులు బోధించనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జనగామ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి, కేయూ వైస్ చాన్స్లర్ టీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.