హైదరాబాద్ : సివిల్స్-2021 ప్రిలిమ్స్ పాసైన బీసీ యువతకు మెయిన్స్కు అవసరమైన శిక్షణనను ఉచితంగా అందించనున్నట్లు బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం శనివారం వెల్లడించారు.
మెయిన్స్ శిక్షణ కోసం ఈ నెల 15వ తేదీలోగా బీసీ స్టడీ సర్కిల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాల కోసం బీసీ స్టడీ సర్కిల్ 040-24071178 నంబర్లో సంప్రదించాలని సూచించారు.