హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): వేములవాడకు వచ్చే భక్తులకు బస్టాండ్ నుంచి ఆలయం వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, ఇందు కు మినీ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తేవాలని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ప్రగతిభవన్లో వేములవాడ ఆలయ, పట్టణాభివృద్ధిపై మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేములవాడ పట్టణాన్ని టెంపుల్టౌన్గా తీర్చిదిద్దాలని సూచించారు. శ్రీరాజరాజేశ్వరస్వామి ఆల య విస్తరణ, పునర్నిర్మాణం, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, పట్టణాభివృద్ధి పనులను సమాంతరంగా పూర్తిచేయాలని ఆదేశించారు. గుడిచెరువు చు ట్టూ నెక్లెస్రోడ్డు నిర్మాణం, బోటింగ్ సౌక ర్యం కల్పించాలని సూచించారు. బద్దిపోచమ్మ ఆలయ విస్తరణతోపాటు, రోడ్ల విస్తరణలో ఇండ్లు, దుకాణాలు కోల్పోతున్నవారికి నష్ట పరిహారం చెల్లించాలని సూచించారు. వేములవాడ, మిడ్మానేరులో పర్యాటకరంగాన్ని మెరుగుపర్చడం ద్వా రా స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
అంతకుముందు మంత్రి కేటీఆర్కు వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ప్రసాదాన్ని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ అందజేశారు. సమావేశంలో పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్కుమార్, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్కుమార్, కలెక్టర్ కృష్ణభాస్కర్, వీటీడీఏ వైస్ చైర్మన్ పురుషోత్తంరెడ్డి పాల్గొన్నారు.