లక్నో, జూలై 9: ఉత్తరప్రదేశ్లో రెండు కప్పా వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. కింగ్జార్జ్ మెడికల్ కళాశాలలో 109 కేసులను పరీక్షించగా, వాటిల్లో 107 కేసులు డెల్టా ప్లస్ కాగా.. రెండు కప్పా కేసులు ఉన్నాయి. అయితే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, సరైన చికిత్స అందిస్తే రోగులు కోలుకోవచ్చని అధికారులు చెప్పారు. మరోవైపు, దేశంలో ఇప్పటి వరకు లాంబ్డా వేరియంట్ కేసు ఒక్కటి కూడా వెలుగుచూడలేదని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.